KTR:తెలంగాణలో కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్..!

62
- Advertisement -

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ ఏం చదివారో ఎంతో కూతుహలంగా అడుగుతున్నారు. ఈ తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు వాళ్ల నకిలీ సర్టిఫికెట్లపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వీటికి సంబంధించిన వ్యవహరంపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఎంతోమంది మున్నాభాయి ఎంబీబీఎస్ ఉన్నట్లున్నారని అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ…తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాదు ఒక తెలంగాణలో మాత్రమే కాకుండా రాజస్థాన్ తమిళనాడు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించి గెలవడం నేరం కాదా?అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..

CYBERCRIME:సైబర్ మోసాలకు బలికావొద్దు..డైల్‌1930.!

వేసవిలో ఈ వ్యాధులు అధికం.. జాగ్రత్త !

- Advertisement -