రాష్ట్రంలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదు..

169
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ దాదాపు తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలల్లో నమోదైన కేసులు గత కొద్దిరోజులుగా వందల్లో నమోదౌతున్నాయి. రాష్ట్రంలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 146 మంది కోలుకున్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా కేసుల వివరాలు వెల్లడించింది.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,243 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,624 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,731 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 678 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 29 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -