రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

113
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. గత 24 గంటల్లో 34,805 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,032 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,610 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,939 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 808 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -