దేశంలో కొత్తగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు..

108
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. కొత్తగా 11,805 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,22,601 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి తాజాగా 78 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది.

ఇదిలా ఉండగా.. శనివారం దేశవ్యాప్తంగా 6,95,789 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 20,13,68,378 టెస్టులు చేసినట్లు వివరించింది. 1,48,766 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 57,75,322 మందికి వ్యాక్సిన్ వేశారని మంత్రిత్వశాఖ వివరించింది.

- Advertisement -