తెలంగాణలో క‌రోనా విజృంభ‌ణ..

170
coronavirus
- Advertisement -

తెలంగాణలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో తాజాగా 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,12,563 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,824గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 37,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 24,156 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 743 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 488, రంగారెడ్డి 407, నిజామాబాద్‌లో 367 చొప్పున ఉన్నాయి.

- Advertisement -