తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..

46
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 35,064 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 287 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 85 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 20 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి. శుక్ర‌వారం కూడా కరోనా కార‌ణంగా మ‌ర‌ణాలేమీ సంభ‌వించ‌లేదు.

అదే సమయంలో 569 మంది కరోనా నుంచి కోలుకోగా, మ‌ర‌ణాలేమీ సంభ‌వించ‌లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,80,462 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -