4 వేలకు చేరిన కరోనా కేసులు….

222
telangana coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరువయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 6గురు మృతిచెందారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో 3920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిన్న నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది.

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లుచేశామని తెలిపారు మంత్రి ఈటల. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే చికిత్స అందిస్తున్నామని స్పష్టంచేశారు.

- Advertisement -