తీరందాటిన వాయుగుండం..భారీ వర్షాలు!

2
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన నైరుతి రుతుపవనాల సీజన్ మొదటి వాయుగుండం ఆదివారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో పాటు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో.. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది.

ముఖ్యంగా నేడు (సోమవారం) అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పగటిపూట తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం 45 శాతం వరకు ఉందని అధికారులు అంచనా వేశారు. రాత్రి వేళల్లో వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:రెండో టీ20 ఓటమిపై శ్రేయాస్

- Advertisement -