11 గంటలకు 23.17శాతం పోలింగ్‌

221
Telangana polls updates
- Advertisement -

తెలంగాణ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున బారులు తీరారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 23.17 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు అధికారులు. వరంగల్ జిల్లాలో 22,మెదక్ 14,నిజామాబాద్‌లో 11,మహబూబ్ నగర్‌లో 12 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్లు ఇప్పటికే సగం శాతం పోలింగ్ కంప్లీటైంది.

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఇప్పటికే 65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈవీఎంలు మొరాయించినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, దివ్యాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారిని మాత్రమే పోలింగ్‌కు అనుమతించనున్నారు.

- Advertisement -