సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ఓటేశారు. బూత్ నెం 13లో కేసీఆర్ దంపతులు ఓటు వేశారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావుతో పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ టీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.
బంజారాహిల్స్లోని సెయింట్ నిజామిస్ స్కూల్ లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న కేటీఆర్ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు.
I am inked 👍👇 Are you?
Go out and vote if you haven’t already #TelanganaElection2018 pic.twitter.com/bMsrkRBttV
— KTR (@KTRTRS) December 7, 2018
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటివరకు 25 శాతం పోలింగ్ నమోదైటన్లు అధికారులు వెల్లడించారు. ఇక గ్రేటర్ పరిధిలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు పోలింగ్లో పాల్గొంటున్నట్లు చెప్పారు.