పదో తరగతిలో ఈ ఏడాది 6 పరీక్షలే.. ఉత్తర్వులు జారీ..

86
SSC exams
- Advertisement -

2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ పదో తరగతిలో 6 పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

- Advertisement -