ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

121
Municipal Election
- Advertisement -

ఈ రోజు రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలకు పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు… కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరిగింది. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరిగింది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. విజయంపై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ సైతం గెలుపు అవకాశాలపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -