ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

430
telangana muncipal elections
- Advertisement -

మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మొత్తం 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అత్యధికంగా ఆదిభట్ల, చౌటుప్పల్‌లో 85 శాతం పోలింగ్‌ నమోదు కాగా అత్యల్పంగా డబీర్ పురా 22 శాతం, నిజాంపేట్‌లో 33.6 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9 కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, 120 మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా ఈ నెల 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -