బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రులు

130
sathyavathi rathod
- Advertisement -

సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రులు..రూ. 20 లక్షల ఆర్ధికసాయం అందించారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

ఇక నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. రాజు గురించిన వివరాలు వెల్లడించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని… వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -