రైతు వేదిక పనులను పరిశీలించిన మంత్రులు..

235
errabelli
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్ధాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు జనగామ జిల్లా కొడకండ్ల వేదిక కానుంది.

ఈ నేపథ్యంలో కొడకండ్ల మండలంలో రైతు వేదిక, ప్రకృతి వనం పనులు, సీఎం కేసీఆర్‌ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న సభాస్థలి పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -