చంద్రబాబువి చిల్లర రాజకీయాలుః మంత్రి తలసాని

277
talasani-Srinivas-Yadav
- Advertisement -

ఏపీ సిఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు, పోలింగ్ సరళిపై తెలంగాణ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణలో 16పార్లమెంట్ స్ధానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో పోలింగ్ శాతం బాగుందన్నారు. పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వత పబ్లిసిటి కోసమే చంద్రబాబు సీఈసీని కలిశారన్నారు.ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయని… ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా? అని ప్రశ్నించారు.

ఓట్ల కోసం ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కరెక్టు కాదని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీలో గెలిచే అభ్యర్థులు కూడా ఓటమి పాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు

- Advertisement -