కోవిడ్‌-19..మంత్రుల సమీక్షా సమావేశం

251
etela rajender
- Advertisement -

కోవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సమన్వయ కమిటీ భేటీ అయింది. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కొనసాగుతున్న ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సోమేశ్‌కుమార్‌, ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు.

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అదేవిధంగా ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చిస్తున్నారు.

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సనందించేందుకు గాంధీ దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. అనుమానితులను ఉంచేందుకు మొత్తం 40పడకలు, 10వెంటిలేటర్లతో కూడిన ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

- Advertisement -