మరోసారి కేంద్రమంత్రి పీయూష్‌తో రాష్ట్రమంత్రుల బృందం భేటీ..

115
niranjan
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తో ఇవాళ మరోసారి భేటి కానుంది రాష్ట్ర మంత్రుల బృందం. సాయంత్రం 7.30 గంటలకు కృషి భవన్ లో సమావేశం జరగనుంది. ఈ భేటీకి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు .

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బృందం లేవనెత్తిన అంశాలపై నిర్ణయం తెలపనుంది కేంద్ర ప్రభుత్వం.

- Advertisement -