ఈ నెల 15న దావోస్‌కు కేటీఆర్‌…

62
- Advertisement -

తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈ నెల 16న ప్రారంభమయ్యే దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్-2023లో కేటీఆర్‌ పాల్గొననున్నారు. అయితే ఈనెల 15న జురిచ్ నగరంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొంటారని బీఆర్ఎస్‌ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్‌లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఈ సమ్మిట్ ఎంతగానో దొహదపడుతుందన్నారు. ఇప్పటికే ఐటీ హబ్‌ గా తెలంగాణ మారిందని కొనియాడారు.

ఇవి కూడా చదవండి…

యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

టీఎస్ఎల్ఆర్బీ పరీక్షల తేదీల మార్పు..

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఒడిషా మాజీ సీఎం

- Advertisement -