తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 4,801 కేసులు..

109
covid
- Advertisement -

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,801 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 7,430 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 756 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 5,06,988 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకు కరోనా నుండి 4,44,049 మంది కోలుకున్నారు. ఇంకా 60,136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,803కి పెరిగింది. కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. రికవరీ రేటులోనూ తెలంగాణ మెరుగ్గానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 82.7 శాతం కాగా, తెలంగాణలో అది 87.58 శాతంగా ఉంది.

- Advertisement -