ఒక్కరోజే..రూ.171 కోట్లు తాగేశారు..

103
liquor
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డు సృష్టించాయి. డిసెంబర్ ఒక్కనెలలోనే రూ.3,459 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.171.93 కోట్ల లిక్కర్‌ సేల్‌ చేశారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి..

గత ఏడాది అంటే 2020 డిసెంబర్‌లో మద్యం అమ్మకాల విలువ రూ.2,764 కోట్ల 78 లక్షలుగా ఉండగా… 2021లో సరికొత్త రికార్డు సృష్టించాయి. 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్‌లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో 40.48 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది.

- Advertisement -