మోడీ క్షమాపణ చెప్పాలి: న్యాయవాదులు

45
modi pm
- Advertisement -

రాజ్యసభ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రం పై చేసిన వ్యాఖ్యల పై హైకోర్టు ఆవరణలో హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించారు న్యాయవాదులు.

రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఆలోచన చేయాలని….తెలంగాణ పై చేసిన కామెంట్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు న్యాయవాదులు.

- Advertisement -