తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ..ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారు అన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దేశానికే ఆదర్శంగా తెలంగాణ ను తీర్చిదిద్దారు …కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల్ల 17 న పార్టీ కేంద్ర కార్యాలయం లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నాం ..రేపు ఉదయం పది గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం..కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడి ని ఈ సందర్భంగా విడుదల చేస్తున్నాం ..ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అన్నారు.
దేవాలయాలు ,మసీదులు ,చర్చిల్లో కేసీఆర్ ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ బీ ఆర్ ఎస్ శ్రేణులు ప్రార్థనలు నిర్వహిస్తాయి ..ఈ కార్యక్రమాలను బీ ఆర్ ఎస్ కార్యకర్తలు విజయవంతం చేయాలి ..కుల గణన ను మళ్ళీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం ..కుట్ర పూరితంగా కులగణన చేశారు …గ్రామాల్లో ,పట్టణాల్లో సర్వే ఎక్కడా సరైన రీతిలో జరగలేదు ..ఆరవై లక్షల జనాభా ను తక్కువ చేసి చూపారు ..ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినా కులగణన లెక్కలు తప్పు అన్నారు.
జనాభా తక్కువుంటే కేంద్ర నిధులు తక్కువగా వస్తాయి ..నియోజకవర్గాల డిలిమిటేషన్ లో జనసంఖ్య తక్కువ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది..శాస్త్రీయంగా సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి ..బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పై అసెంబ్లీ లో చట్టబద్దత చేస్తే లాభం లేదు .కేంద్రం నిర్ణయం తీసుకోవాలి…కేసీఆర్ గతం లోనే బీసీ లకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేశారు …బీసీ లు అడుక్కు తినేవాళ్లు కాదు ..తామెంతో తమకంత అని బీసీ లు నినదిస్తున్నారు ..జనానికి అవసరం లేని విషయాలపై నేను స్పందించను ..ghmc స్టాండింగ్ ఎన్నికల్లో పార్టీ వైఖరి ని ఈ నెల 17 న ఖరారు చేస్తాం..మేయర్ పై అవిశ్వాసం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు …ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుంది ..మా వ్యూహాలు మాకుంటాయి..కాంగ్రెస్ కు మారిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలే తమ నిర్ణయానికి పాశ్చాతాప పడుతున్నారు ..కాంగ్రెస్ లోకి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వెళతారన్న వార్తలు వట్టి ఊహాగానాలే ..వాటిని పట్టించు కోవాల్సిన అవసరం లేదు అన్నారు తలసాని.
Also Read:చెమట పొక్కులకు చెక్ పెట్టండిలా..!