తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్‌..

450
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని రాజ్ భవన్ గవర్నమెంట్ పాఠశాలలో ఆవరణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరిక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో మొక్కలు నాటారు.

Green challenge

అనంతరం 1000 మంది విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు నాటే విదంగా ప్రతిజ్ఞ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్, నవీనా చారి,శ్రీనివాస్, హైదరాబాద్ గ్రంధాలయం చైర్మన్ ప్రసన్న,జాగృతి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Green challenge

- Advertisement -