KTR:పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ

71
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన గమ్యస్థానం అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. భారతదేశంలో పెట్టుబడులుపెట్టే కంపెనీలకు కేరాఫ్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్‌తో స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆదేశ వ్యాపార వాణిజ్య ప్రతినిధులు పలు కంపెనీలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని వారికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎనిమిదేండ్ల‌ కాలంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకువచ్చిన మౌలిక వసతుల కల్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల పైన తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తుందని స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌కు జాన్ తెస్లెఫ్ తెలిపారు.

Also Read: KTR:పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యం

ఈ సందర్భంగా స్వీడన్ రాయబారిగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణంతో మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు.

Also Read: IMD:ముంచుకొస్తున్న మోచా..తీర ప్రాంతాలకు ఆలెర్ట్‌..!

- Advertisement -