కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

13
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు ముగిసినా మత్స్య సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ నిలదీశారు.

వీలైనంత త్వరగా మిగిలిన 21 జిల్లాల్లో మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టింది ప్రభుత్వం.

దీంతో కోర్టు ధిక్కరణ కింద మరోసారి పిటిషన్ వేశారు ముదిరాజు సంఘం నాయకులు. మరోసారి విచారించి, కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.

Also Read:BB9:మాధురి పక్కా లోకల్

- Advertisement -