చేతివృత్తులకు భరోసా..లక్ష ఆర్థిక సాయం

34
- Advertisement -

తెలంగాణ కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో చేతివృత్తుల పాత్ర అమోఘం. చేతివృత్తులైన నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది. ఇందుకు తగినవిధంగా విధివిధానాల వేగంగా రూపొందించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Also Read: నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..

వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం https://tsobmmsbc.cgg.gov.in రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌ల‌తో స‌ర‌ళ‌మైన అప్లికేష‌న్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా త‌క్ష‌ణ‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీన సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Also Read: మళ్ళీ సి‌ఎం కే‌సి‌ఆరే.. వారికి ముందే తెలుసా ?

- Advertisement -