29న ఇఫ్తార్..

75
kcr
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈనెల 29న ప్రభుత్వం తరపున ఇఫ్తార్ ఇవ్వనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.

ఇస్లాంలో రంజాన్‌ మాసానికి మంచి ప్రాధాన్యత ఉంది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ఇప్తార్‌ వర కు మంచి నీళ్లు సైతం తాగకుండా ఉపవాసం చేస్తారు. ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధల తో జరుపుకుంటారు.

- Advertisement -