సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు:ఎర్రబెల్లి

152
dayakarrao
- Advertisement -

ఉద్యోగులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉద్యోగులంతా సీఎం కెసిఆర్ కి మంచి మిత్రులు. మీకు అన్యాయం జరగదని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నా అన్నారు. వరంగల్ లోని హరిత హోటల్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ – 2021 ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…. ప్రతిపక్షాలు మాట్లాడే తీరు బాగాలేదు…… వేరే రాష్ట్రాల్లో, వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మహా రాజు…. నాక్కూడా ఉద్యోగ సంఘాల నాయకులు నాకు చిరకాల మిత్రులు…. సీఎంకి అన్నీ తెలుసు. అంతా సంతోష పడే విధంగా ఫిట్ మెంట్ ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు.

నాటి ఉద్యమం నుంచి నేటి వరకు అన్ని విధాలుగా తెలంగాణ ను ఆదుకున్నది వరంగల్ జిల్లా నే అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెగించి కొట్లాడి న బిడ్డలు వరంగల్ బిడ్డలు. ఉద్యోగులు. అధికారుల సంఘాలు పెట్టాలంటే నే భయపడిన సందర్భాల్లో… అండగా ఉంది వరంగల్ బిడ్డలే అన్నారు. వరంగల్ పై సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేక అభిమానం ఉంది. ఇంటింటికీ మంచినీరు, సాగు నీరు, 24గంటల విద్యుత్, కెసిఆర్ కిట్లు, పెన్షన్లు, గురుకుల విద్యా సంస్థలు ఇలా అనేక విజయాలు ఉన్నాయన్నారు.

గతంలో మనం ఆశించిన దానికంటే, అధికంగా 43శాతం ఫిట్ మెంట్ వచ్చింది. అనేకమంది ఉద్యోగులకు జీతాలు 300 శాతం వరకు పెంచుకున్నం. నెల రోజుల్లో 70వేల మంది అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన0. ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన పని లేదు. వాటి మాటలను లెక్క చేయకండి. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధిని సాధించినం అన్నారు శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -