డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు

194
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాలను వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సంకల్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర రాష్ట్రాలపై వివక్షత కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ అభివృద్ది పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షను పూర్తిస్థాయిలో ఎండగట్టాలని తీర్మానించారు. గత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో కేంద్రం కోత విధించడానికి వ్యతిరేక తీర్మానం చేయనున్నారు. 2022-2023వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో రూ.40వేలకోట్లకుపైగా తగ్గుదల నమోదైందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి…

ఏపీలో పీఠాధిపతుల కొత్త పార్టీ?

బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు..

చీకటి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా…

- Advertisement -