రాష్ట్రంలో కొత్త మండలాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ…

68
logo
- Advertisement -

రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌లు జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమల్‌, కొత్తపల్లి మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలలో దుడ్యాల్‌ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్‌, బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ సాలూర మండలంగా ఏర్పాటు కానుంది. మహబూబాబాద్‌ జిల్లాలో సీరోల్‌ మండలం, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్‌, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నిజాంపేట్‌, కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో జగిత్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎండపల్లి, కోరుట్ల డివిజన్‌ పరిధిలో భీమారం మండలాలు ఏర్పాటు కానున్నాయి.

కొత్త మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాలని పేర్కొంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

- Advertisement -