రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు..

250
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నాయకులు,ప్రజాప్రతినిధులు,అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండా అవిష్కరించి వందనం సమర్పించారు. అలాగే సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ స్థూపానికి కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళ్ళు అర్పించారు మంత్రి హరీష్ రావు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు విప్,ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు,జడ్పీచైర్పర్సన్ పద్మావతి,కలెక్టర్ ఈ శ్రీధర్. అలాగే కోమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ అరికాపుది గాంధీ అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళు అర్పించారు. నిర్మల్‌ జిల్లాలోని మంత్రి కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

- Advertisement -