ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

312
Telangana Formation Day
- Advertisement -

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి.అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేసి, అమర వీరుల స్థుపం వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా వేణుగోపాల చారి మాట్లాడుతూ..

సిఎం కేసీఆర్ పాలన లో రాష్ట్రం అభివృద్ధి లో దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. అన్ని వర్గాలు మెచ్చేలా సిఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రాష్ట్ర అభివృద్ధి కి నిదర్శనాలన్నారు. హైదరాబాద్ ఉగ్రస్థావరాలకు అడ్డాగా మారిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తోన్నామని చెప్పారు.

- Advertisement -