తెలంగాణ ఉద్య‌మకారుడు చిరంజీవి మృతి.. సీఎం సంతాపం..

261
- Advertisement -

తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

చిరంజీవి మరణం పట్ల ముఖ్య మంత్రి కెసిఅర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవి కుటుంబం ఆస్ప‌త్రి ఖ‌ర్చులు భ‌రించ‌లేని స్థితిలో ఉంద‌ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 ల‌క్ష‌లు మంజూరు చేయించారు.

- Advertisement -