రాష్ట్రంలో కొత్త‌గా 111 కరోనా కేసులు నమోదు..

159
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్త‌గా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,562 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,642 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,807 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 689 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

- Advertisement -