కేసీఆర్‌ సారు చెప్పినట్లే పంటల సాగు…

294
farmers
- Advertisement -

నియంత్రిత సేద్యం చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును రైతులంతా స్వాగతిస్తున్నరు. సీఎం మాట ప్రకారమే సాగు చేస్తామని నిర్ణయం తీసుకున్న గ్రామంగా గాదెపల్లి నిలవగా ఈ బాటలోనే మరిన్ని పల్లెలు నడుస్తున్నాయి.

తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సీఎం కేసీఆర్ తీసుకున్న పంటల మార్పిడి విధానం చాలా మంచి నిర్ణయం అని నర్సింహులపల్లె,బుచ్చయ్యపల్లె,ఖానంపల్లి గ్రామాల రైతులు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తీర్మానం చేస్తూ ప్రమాణం చేసి నియంత్రిత పద్దతిలోనే పంటలను సాగుచేస్తామన్నారు.

- Advertisement -