తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల..

240
papireddy
- Advertisement -

తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాల రిలీజ్ అయ్యాయి. ఆగస్టు 3న జరిగిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టుకు 24 వేల మంది విద్యార్థులు హాజరుకాగా 95.16 శాతం మంది అర్హత సాధించారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఫలితాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఆయన విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

24 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుండగా ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు ,సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 18న స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.

- Advertisement -