తెలంగాణలో కరోనాతో వైద్యుడి మృతి..

216
corona
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ అదుపులోకి రావడం లేదు.. ఈ వైరస్‌ ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిని వెంటాడుతోంది. వారు కరోనా బారిన పడటంతో అందరిలో భయంతో వణిపోతున్నారు.

హైదరాబాద్‌లో తాజాగా ఓ వైద్యుడు(70) కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వైద్యుడు వారం రోజుల క్రితం జ్వరంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. చికిత్సలో భాగంగా అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మరణించాడు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో పాటు బీపీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

- Advertisement -