చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం :సీఎస్

21
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతూ… వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. పచ్చని ప్రకృతిని పెంచి భావితరాలకు పంచుదామని పిలుపునిస్తున్నారు. తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌్లోని సంజీవయ్య పార్క్‌లో ఆయన మొక్కలు నాటారు. సీఎస్‌ వెంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, హెచ్ ఎం డీ ఏ అధికారులు, తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ…. సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్ తరాల బాగుకోసం, ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు. జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు. భారత దేశ చరిత్రలో ఇంత భారీయెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదన్నారు.

ప్రకృతి పట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటడం.. ముఖ్యమంత్రిగారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానసపుత్రిక “హరిత హారానికి” మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, నా పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గోనే అవకాశం కల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆద్యులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు “హరిత హారం”లో అదే విధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి…

చలికాలంలో ఈ పండు తింటే.. ఇన్ని ఉపయోగాలా !

స్వామి వివేకానంద..స్పూర్తినిచ్చే సూక్తులు

సొరకాయ రసంతో.. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ !

- Advertisement -