తెలంగాణ పత్తికి నాణ్యతలో ప్రత్యేక గుర్తింపు: ఎర్రబెల్లి

162
errabelli
- Advertisement -

ప్రపంచంలోనే తెలంగాణ పత్తికి నాణ్యతలో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి మండలం మైలారం గ్రామ సమీపంలో భాగ్యలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం పరిపాలిస్తున్నదన్నారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

తొర్రూరు మండలం అమ్మాపురంలో గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి….పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. నిరంతర అధ్యయనంతో లోక జ్ఞానం పెరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. వారు పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానంతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.

- Advertisement -