1,275కు చేరుకున్న కరోనా కేసులు…

245
telangana coronavirus
- Advertisement -

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,275కు చేరుకుంది. సోమవారం ఒక్కరోజే 79 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అందరిని షాక్‌కు గురిచేసింది. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.

ఇప్పటివరకు 30మంది చనిపోగా 801 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 444 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి ర్యాండమ్‌ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -