రాష్ట్రంలో 24 గంటల్లో 202 కరోనా కేసులు..

95
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 202 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,91,118కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,442 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 2,85,102 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,574 మంది మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉందని.. రికవరీ రేటు భారత్‌లో 96.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 97.93 శాతానికి పెరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది వైద్య,ఆరోగ్య శాఖ.

- Advertisement -