48 వేలకి చేరువలో కరోనా కేసులు..

292
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1430 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు మృతిచెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కి చేరాయి.

రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 429 మంది మృతిచెందగా 10,891 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 36,385 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసిలో 703, రంగారెడ్డిలో 107, మేడ్చల్ లో 105, సంగారెడ్డిలో 50, ఖమ్మంలో 14, కామారెడ్డిలో 43, వరంగల్ అర్బన్ లో 34, వరంగల్ రూరల్ లో 20, నిర్మల్ లో 1, కరీంనగర్ లో 27, జగిత్యాలలో 18, యాదాద్రిలో 9 కేసులు నమోదయ్యాయి.

మహబూబాబాద్ లో 27, పెద్దపల్లి లో4, మెదక్ లో 26, మహబూబ్ నగర్ లో 6, మంచిర్యాలలో 5, భద్రాద్రి కొత్తగూడెం లో 5, జయశంకర్ భూపాలపల్లిలో 27, నల్గొండలో 45, రాజన్న సిరిసిల్లలో 8, ఆదిలాబాద్ లో 7, వికారాబాద్ లో 9, నగర్ కర్నూల్ లో 18, జనగాం లో 9, నిజామాబాద్ లో 48, సిద్ధిపేట 14, సూర్యాపేటలో 27, జోగులాంబ గద్వాల్ లో 4 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -