44వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు…

207
ap corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 వేలకు చేరువైంది. గత 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా…. ఆరుగురు మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 43,780కి చేరగా ఇప్పటివరకు కరోనాతో 409 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,765 యాక్టివ్ కేసులు ఉండగా 30,607 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే…. జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ లో 62, సంగారెడ్డిలో 86 నమోదయ్యాయి.

- Advertisement -