40 వేల చేరువలో కరోనా కేసులు…

185
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరువైంది. బుధవారం 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కి చేరింది.

కరోనా నుండి 25,999 మంది కోలుకోగా ప్రస్తుతం 12,958 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనాతో ఇప్పటివరకు 386 మంది మృత్యువాత పడ్డారు.గత 24 గంటల్లో 11 మంది కరోనాతో చనిపోగా జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 796 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌ మల్కాజిగిరి 115, సంగారెడ్డి 73, నల్లగొండ 58, వరంగల్‌ అర్బన్‌ 44, కరీంనగర్‌ 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26 కేసులు నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్‌ 21, పెద్దపల్లి 20, మెదక్‌ 18, జయశంకర్‌ భూపాలపల్లి 15, సూర్యాపేట జిల్లాల్లో 14 కేసులు, యాదా ద్రి భువనగిరి, నిజామాబాద్‌ 13 చొప్పున, జనగామ 8, భద్రాద్రి కొత్తగూడెం 7, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6 చొప్పున, మహబూబాబాద్‌, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో 5 చొప్పున, జోగుళాంబ గద్వా ల, ములుగు జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్‌ 1 కేసు నమోదైంది.

- Advertisement -