తెలంగాణలో మరణాల రేటు ఒక్కశాతమే!

166
corona in karnataka
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలు దాటింది. గత 24 గంటల్లో 1,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా తెలంగాణలో మరణాల రేటు ఒక్క శాతం మాత్రమేనని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.

ఇక శుక్రవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 762 నమోదయ్యాయి. ఇప్పటివరకు 32,224 పాజిటివ్ కేసులు నమోదుకాగా 19,205 యంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు మొత్తం 1,51,109 పరీక్షలు చేయగా కరోనాతో 339 మంది మరణించారు. మొత్తం 17,081 పడకలు ఉండగా, 1,618 మాత్రమే భర్తీ అయ్యాయి. 15,463 పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -