తెలంగాణలో 25,773కి చేరిన కరోనా కేసులు…

203
coronavirus
- Advertisement -

తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు దాదాపు 2 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు 25,773 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 10466 కేసులు యాక్టివ్ గా ఉంటె, 14,781 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నమోదైన 1831 కేసుల్లో 1419కేసులు జీహెచ్ఎంసి పరిధిలో ఉండటం విశేషం.

ఇక ఇప్పటివరకు కరోనాతో 306 మంది మృతిచెందగా గత 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మరణించారు. జీహెచ్ఎంసి తరువాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 160 కేసులు నమోదు కాగా, మేడ్చల్ లో 117 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి లో 3, కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1 కేసు నమోదయ్యాయి.

నల్గొండ, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలో 9 చొప్పున, వికారాబాద్ లో 7, మెదక్ జిల్లాలో 20, సూర్యాపేట లో 1, పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, జగిత్యాలలో 4, మెహబూబాబాద్ లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

- Advertisement -