రాష్ట్రంలో 24 గంటల్లో 536 కరోనా కేసులు..

148
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 79 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 536 కొవిడ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,79,135కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 7183 యాక్టివ్ కేసులుండగా 2,70,450 మంది కరోనా నుండి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,502 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా ఉండగా రికవరీ రేటు 96.88శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ఇప్పటి వరకు 62,57,754 టెస్టులు చేసినట్లు వివరించింది.

- Advertisement -