రాష్ట్రంలో 24 గంటల్లో 221 కరోనా కేసులు..

114
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 221 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 3569 యాక్టివ్ కేసులుండగా రికవరీ కేసుల సంఖ్య 2,87,899కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1588 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.24 శాతానికి పెరిగిందని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 76,32,980కు చేరింది.

- Advertisement -