రాష్ట్రంలో 70 వేలు దాటిన కరోనా కేసులు..

215
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2012 కరోనా కేసులు నమోదు కాగా 13 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 70,958 నమోదుకాగా 19,568 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 50,814 మంది కోలుకున్నారు. కరోనాతో 576 మంది మృత్యువాతపడగా ఇప్పటివరకు 5,22,143 టెస్టులు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 532 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్‌ అర్బన్‌లో 127, ఖమ్మం 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌ 83, నల్గొండలో 49, పెద్దపల్లి జిల్లాలో 41, మహబూబ్‌నగర్‌లో 51, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో 48, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 46, భద్రాద్రి కొత్తగూడెంలో 52, కరీంనగర్‌ 41, కామారెడ్డిలో 75 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -